జమ్మూ-కశ్మీర్ నేతల విడుదలకు డిఎంకే ఆందోళన

జమ్మూ-కశ్మీర్ నేతల విడుదలకు డిఎంకే  ఆందోళన

చెన్నై: జమ్మూ-కశ్మీర్ లో నేతల విడుదలను డిమాండు చేస్తూ డీఎంకే సభ్యులు గురువారం ఉదయం పదకొండు గంటలకు పార్లమెంటు ప్రాంగణంలో నిరసన చేపడ తారని ఆ పార్టీ అధినేత స్టాలిన్ బుధవారం ఇక్కడ వెల్లడించారు. తమ సభ్యులకు పార్టీ నేత టీఆర్ బాలు నాయకత్వం వహిస్తారని చెప్పా రు. ఈ ఆందోళనలో 14 రాజకీయ పక్షాలు పాల్గొంటాయని పేర్కొన్నారు.ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కేంద్ర మాజీ మంత్రి చిదంబరాన్ని రాజ కీయ కక్షతోనే అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. న్యాయ కోవిదుడైన ఆయన ఈ సమస్యను చట్టపరంగా, సమర్థంగా ఎదుర్కొంటా రని వ్యాఖ్యానించారు. కేంద్రం అనుసరిస్తున్న కక్ష సాధింపు వైఖరిని ఖండిస్తున్నట్లు చెప్పారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos