ఆదికేశవులు కుమారుడు శ్రీనివాస్ అరెస్టు

ఆదికేశవులు కుమారుడు శ్రీనివాస్ అరెస్టు

మాదక ద్రవ్యాల సరఫరా ఆరోపణలతో దివంగత ఎంపీ డీకే ఆదికేశవులు నాయుడు కుమారుడు డీకే శ్రీనివాసులు నాయుడును నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) అధికారులు బుధవారం అరెస్ట్ చేశారు. రాజకీయ, సినీ ప్రముఖులకు శ్రీనివాసులు నాయుడు డ్రగ్స్ సరఫరా చేస్తున్నారన్న ఆరోపణలతో బుధవారం ఎన్‌సీబీ అధికారులు బెంగళూరులోని శ్రీనివాసులు నాయుడు సహా పలువురు ఇళ్లలో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో శ్రీనివాసులు నాయుడు ఇంటిలో భారీ ఎత్తున డ్రగ్స్ పట్టుబడినట్లు సమాచారం.
శ్రీనివాసులు నాయుడు ఇంటిలో డ్రగ్స్ దొరికిన నేపథ్యంలో అక్కడికక్కడే ఆయనను ఎన్‌సీబీ అధికారులు అరెస్ట్ చేశారు. చిత్తూరు కేంద్రంగా రాజకీయాలు సాగిస్తున్నడీకే ఆదికేశవులు నాయుడు కుటుంబం బెంగళూరు కేంద్రంగా వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బెంగళూరులోనే శ్రీనివాసులు నాయుడు ఉంటున్నారు. ఏపీ, కర్ణాటకకు చెందిన పలువురు రాజకీయ, సినీ రంగానికి చెందిన ప్రముఖులతో ఆయనకు సంబంధాలు ఉన్నట్లు సమాచారం.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos