హోసూరు సమీపంలోని సూలగిరి కామరాజ్ నగర్ల ఎమ్మెల్యే మురుగన్ నిత్యవసర వస్తువులను పంపినిచేశారు.సూలగిరి కామరాజ్ నగర్లో 18 మందకి కరోనా వైరస్ సోకడంతో రోగులందరిని ఆస్పత్రులకు తరలంచారు.ఇదిలా ఉండగా కామరాజ్ నగర్ ప్రాంతం పూర్తిగా కంటోన్మెంట్ ప్రాంతంగా పరిగణించి ఆప్రాంతంలోకి ఎవరు ప్రవేశించక గట్టి బందోబస్తు విధించారు.ఈ ప్రాంతంలో ప్రజలు ఎవరు బయటకు వచ్చేందుకు వీలు లేకపోవడంతో కామరాజ్ నగర్లో నివసిస్తున్న ప్రజలకు నిత్యవసర వస్తువులకు ఇబ్బంది కలుగక చర్యలు చేపట్టారు.అందులో భాగంగ వేపనపల్లి ఎమ్మెల్యే మురుగన్ కామరాజ్ నగర్లోని 5 వందల కుటుంబాలకు నిత్యవసర వస్తువులను అందజేశారు.భౌతిక దూరాన్ని పాటిస్తూ ఎమ్మెల్యే మురుగన్ నిత్యవసరవస్తువులను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మురుగన్తోపాటు డిఎంకె పార్టీ సూలగిరి యూనియన్ కార్యదర్శి వెంకటేష్,డీఎంకే పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.