అమరావతి: రాష్ట్రం దివాళా అంటూ పచ్చ మాధ్యమాలు తప్పుడు వార్తలు రాస్తున్నాయని రాష్ట్ర మత్స్య, పశు సంవర్ధక శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ ధ్వజమెత్తారు. గురువారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడారు. ‘చెత్త వార్తలు రాయొద్దు. ప్రజలకు పనికొచ్చే వార్తలు రాయండి. చంద్రబాబు రు.రెండున్నర లక్షల కోట్లు అప్పులు చేసారు. రాష్ట్రాన్ని అప్పులు ఊబిలోకి నెట్టింది ఆయనే. వైఎస్ జగన్ పాలనపై బహిరంగంగా తెదేపాతో చర్చకు సిద్ధం. మాతో చర్చించేందుకు సిద్ధమా.. లేదా అనే దానికి తెదేపా సమాధానం చెప్పాలన్నా’రు.