క్లాస్ సినిమాలకు చిరునామాగా నిలిచిన ప్రముఖ దర్శకుడు మణిరత్నం గుండెపోటుతో ఆసుపత్రిలో చేరారు.ఇప్పటికే మూడుసార్లు గుండెనొప్పితో ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకున్న మణిరత్నం నాలుగవసారి గుండెనొప్పితో ఆసుపత్రిలో చేరారు.గుండెనొప్పి రాగానే కుటుంబ సభ్యులు చెన్నై నగరంలోని గ్రీమ్స్రోడ్లోనున్న అపోలో ఆసుపత్రికి తరలించారు.ప్రస్తుతం మణిరత్నం ఆరోగ్యం స్థిరంగానే ఉందని వైద్యుడు లోకేశ్ తెలిపారు. మొదటిసారి 2004లో యువ చిత్రం షూటింగ్ సమయంలో గుండెపోటుకు గురైన మణిరత్నం అనంతరం 2015లో ఓకే బంగారం షూటింగ్ సమయంలో రెండవసారి గుండెపోటుకు గురయ్యారు.గత ఏడాది కూడా గుండెపోటుకు గురైన మణిరత్నం సోమవారం మరోసారి గుండెపోటుకు గురయ్యారు.భారీ బడ్జెట్తో భారీ తారాగణంతో బాహుబలి తరహాలో పొన్నియన్ సెల్వన్ గ్రాండియర్ చిత్రానికి సిద్ధం అవుతున్నారు.