దిగ్విజయ్ సింగ్‌పై కేసు నమోదు

భోపాల్: సీనియర్ కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్కు వ్యతిరేకంగా పోసులు కేసు దాఖలు చేసారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్సింగ్ చౌహాన్ ప్రతిష్టను దెబ్బతీసేలా తప్పుడు ఎడిటెడ్ వీడియోను ఉద్దేశ పూర్వకంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారని ఆయనపై భాజపా నేతలు ఫిర్యాదు చేశారు. మద్యానికి సబంధించి మాట్లాడిన పాత వీడియోను వారికి అనుకూలంగా ఎడిట్ చేసి పోస్ట్ చేసారని ఆరోపించారు. శివ రాజ్సింగ్ నేతృత్వంలోని ప్రభుత్వం ఆదివాసీలను మోసం చేసిన కేసును లేవనెత్తడంతో తనపై అక్రమంగా కేసు నమోదు చేశారని దిగ్విజయ సింగ్ వివరించారు. నకిలీ విడియోపై నిరభ్యంతరంగా దర్యాప్తు చేపట్టవచ్చని ట్వీట్ చేశారు. కాగా, సైబర్ చట్టం కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు భోపాల్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఇర్షాద్ వాలి తెలిపారు

తాజా సమాచారం

Latest Posts

Featured Videos