మళ్లీ పెట్రో మంటలు

మళ్లీ పెట్రో  మంటలు

న్యూ ఢిల్లీ: దేశంలో వరుసగా నాలుగో రోజు –శుక్రవారం కూడా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. లీటరు పెట్రోల్పై 28 పైసలు, డీజిల్పై 31 పైసలు వంతున పెంచినట్లు ప్రభుత్వ రంగ చమురు సంస్థలు తెలిపాయి. ఢిల్లీలో నిన్న లీటరు పెట్రోల్ ధర రూ.90.99 ఉండగా, ఈ రోజు రూ.91.27కు చేరింది. ఇక లీటరు డీజిల్ ధర నిన్న రూ.81.42 ఉండగా, ఈ రోజు రూ.81.73కి పెరిగింది. హైదరాబాద్లో లీటరు పెట్రోలు ధర నిన్న రూ.94.57గా ఉండగా, డీజిల్ ధర రూ.88.77గా ఉన్న విషయం తెలిసిందే. ఈ రోజు హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర రూ.94.68, లీటర్ డీజిల్ ధర రూ.89.11కు చేరింది. ఇక ముంబైలో నిన్న లీటరు పెట్రోలు ధర రూ.97.34, డీజిల్ ధర రూ.88.49గా ఉండగా, ఈ రోజు పెట్రోల్ ధర రూ.97.61, డీజిల్ ధర రూ.88.82కి చేరింది

తాజా సమాచారం

Latest Posts

Featured Videos