ముంబై : దేశీయంగా ఇంధన ధరల పరుగు కొనసాగుతోంది. వరుసగా మూడో రోజు – గురువారం పెట్రోల్ , డీజిల్ ధరలు రికార్డు స్థాయికి చేరాయి. పెట్రోల్ ధరను 25 పైసలు, డీజిల్పై 30 పైసలు చొప్పున చమురు మార్కెటింగ్ కంపెనీలు పెంచాయి. ఈ తాజాపెంపుతో దేశవ్యాప్తంగా మెట్రోలలో ధరలు కొత్త గరిష్టాన్ని నమోదు చేశాయి. దీంతో వాహనా దారుల్లో అలజడి మొదలైంది. ప్రధాన నగరాల్లో లీటరు పెట్రోల్ , డీజిల్ ధరలు ఢిల్లీలో రూ. 87.85, రూ. 78.03,ముంబైలో రూ. 94.36 రూ. 84.94, కోల్కతాలో రూ .89.16,రూ .81.61, చెన్నైలో రూ .90.18 , రూ . 83.18 బెంగళూరులో రూ.90.78, రూ.82.72, హైదరాబాదులో రూ. 91.35, ధర రూ. 85.11, అమరా వతిలో రూ.93.99, రూ. 87.25 కి చేరాయి. ఇంధన ధరల పెరుగుదలపై కాంగ్రెస్ ఎంపీ మాణిక్కం ఠాగూర్ లోక్సభలో వాయిదా తీర్మానాన్ని ప్రతిపాదించారు.