ఢిల్లీ : వెస్టిండీస్ పర్యటన నుంచి తప్పుకున్న మహేంద్ర సింగ్ ధోనీ దేశ రక్షణ విధులను నిర్వర్తించనున్నాడు. లెఫ్టినెంట్ కల్నల్ హోదా కలిగిన ధోనీ పారా మిలటరీ సైనికుడిగా జులై 31 నుంచి ఆగస్టు 15 వరకూ సేవలందిస్తాడు. ఇందులో భాగంగా గస్తీ, రక్షణ విధులను నిర్వర్తించనున్నాడు. కశ్మీర్ లోయలోని సైనిక శిబిరాల్లో సైనికులతో కలిసి ధోనీ విధులు నిర్వహించనున్నాడు. టీమిండియాకు అందించిన సేవలకు గానూ 2011లో ధోనీకి భారత సైన్యం లెఫ్టినెంట్ కల్నల్ హోదా కల్పించింది. ధోనీ నిర్ణయాన్ని సైనిక ఉన్నతాధికారులు అభినందించారు. యువతకు ఆదర్శంగా నిలిచారని కొనియాడారు.