ప్రజాస్వామ్యమా? నిరంకుశ పాలనా?

ప్రజాస్వామ్యమా? నిరంకుశ పాలనా?

అమరావతి: ‘ప్రశ్నించే గొంతును నొక్కడమే ప్రజాస్వామ్య’మాని తెదేపా అధిపతి చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పార్టీ నేతలు, కార్యకర్తలతో బుధవారం ఇక్కడి నుంచి టెలి కాన్పరెన్స్ నిర్వహించారు. ‘పునరావాస శిబిరానికి ఆహారం, నీళ్లు తీసుకెళ్లిన వారిని అడ్డుకోవటం అమానుషం. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా, నిరంకుశ పాలనలో ఉన్నామా’ని ఆక్రోశించారు. వైకాపా ప్రభుత్వ దుర్మార్గాలను ప్రతి ఒక్కరూ కూడ ఖండించాలని కోరారు. న్యాయం చేయమన్న తమ పట్ల కక్ష పూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. చంద్రబాబు నాయుడు చలో ఆత్మకూరు ఆందోళనలో పాల్గొనకుండా ఆయన్నుఆయన ఇంటిలోనే పోలీసులు నిర్బంధించారు. దరిమిలా ఆయన టెలికాన్ఫరెన్సు జరిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos