కరోనా వైరస్ ప్రభావం వల్ల దేశంలో లాక్డౌన్ విధించిన నేపథ్యంలో సొంతూళ్లకు చేరుకోవడానికి ప్రజలు అన్ని రకాల మార్గాలను అన్వేషిస్తున్నారు. కొంతమంది బైకులపై వెళుతుంటే మరికొంత మంది నిత్యావసర వస్తువుల వాహనాల్లో,నీటి ట్యాంకుల్లో వెళుతున్నారు.కొంతమంది కాలినడకన సైతం ఇళ్లకు వెళ్లడానికి సాహసిస్తున్నారు.ఢిల్లీలో డెలివరీ బాయ్గా పని చేస్తున్న ఓ వ్యక్తి సైతం ఇదే సాహసానికి ప్రయత్నించి ప్రాణాలు కోల్పోయాడు.ఢిల్లీలోని తుగ్లకాబాద్లో ఉన్న ఓ రెస్టారెంట్లో పనిచేస్తున్న 39 ఏళ్ల రణ్వీర్ సింగ్ మధ్యప్రదేశ్లోని మోర్నే జిల్లాలో ఉన్న తన స్వంత ఊరికి కాలిబాటన బయలుదేరాడు. ఢిల్లీ–ఆగ్రా హైవే రూట్లో ప్రయాణం ప్రారంభించిన రణ్వీర్.. మార్గమధ్యంలోనే ప్రాణాలు విడిచాడు.హెన్హెచ్2పై ఉన్న కైలాష్ టర్నింగ్ వద్ద అతను తుదిశ్వాస విడిచినట్లు పోలీసులు చెబుతున్నారు. రణ్వీర్తో పాటు మరో ఇద్దరు కూడా కాలిబాటనే ఇంటిదారి పట్టారు. వాస్తవానికి ఆ రూట్లో పోలీసుల ఆహారం, నీళ్లు సరఫరా చేస్తున్నారు. కానీ దాదాపు 100 కిలోమీటర్లు నడిచిన రణ్వీర్కు ఛాతిలో నొప్పి వచ్చినట్లు తోటివారు చెప్పారు. సమీపంలో ఉన్న వారు సాయం చేసినా.. పరిస్థితి చేయిదాటింది. రణ్వీర్ ఇంకా ఇంటికి వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న సమయంలోనే ప్రాణాలను కోల్పోయాడు. అతని మృతేదహానికి పోలీసులు పోస్టుమార్టమ్ నిర్వహిస్తున్నారు.