ఉగ్రవాద అనుమానితుల అరెస్ట్

ఉగ్రవాద అనుమానితుల అరెస్ట్

తూర్పు ఢిల్లీ : ఇక్కడి శకర్పుర్ ప్రాంతంలో ఐదుగురు ఉగ్రవాద అనుమానితులను అరెస్ట్ చేశారు పోలీసులు. ఇందుకోసం ఎదురు కాల్పులు జరిగినట్లు పోలీసులు తెలిపారు. నిందితులకు ఖలీస్థాన్తో సంబంధాలు ఉన్నట్లు అనుమానిస్తున్నామన్నారు. ముగ్గురు కశ్మీర్, ఇద్దరు పంజాబ్కు చెందిన వారని వివరించారు. ఆయుధాలు, ఇతర మందుగుండు సామగ్రి, మాదక ద్రవ్యాల్ని స్వాధీనం చేసుకున్నారు. కొందరికి ఉగ్ర సంస్థలతో సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. దర్యాప్తు తర్వాత నిజానిజాలు తెలుస్తాయని ప్రత్యేక విభాగం , డిప్యూటీ కమిషన్ ప్రమోద్ సింగ్ కుశ్వాహ్ తెలిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos