ఆ ‘లెవల్` దర్శనాలు రద్దు

ఆ ‘లెవల్` దర్శనాలు రద్దు

తిరుమల : శ్రీవారి ఆలయంలో ఎల్1, ఎల్2, ఎల్3 దర్శనాలను రద్దు చేస్తున్నట్లు తితిదే చైర్మన్ వైవీ. సుబ్బారెడ్డి వెల్లడించారు. సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యం ఇవ్వడానికే వీటిని రద్దు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ తిరుమలలో చోటు చేసుకుంటున్న అక్రమాలను నిరోధించేందుకు చర్యలు తీసుకుంటున్నదని తెలిపారు. బ్రేక్ దర్శనాల్లో అమలు చేస్తున్న ఎల్-1, 2, 3 విధానంలోని లోపాలను ఆసరా చేసుకొని పలు అక్రమాలకు పాల్పడ్డారని చెప్పారు. వ్యవస్థలో ఉన్న లోపాలను సరిదిద్దడం ద్వారా సామాన్య భక్తుల దర్శనం సమయం మరింత పెంచుతామని అన్నారు. నేటి నుంచే వాటిని రద్దు చేస్తున్నామని తెలిపారు. సాంకేతిక పరమైన అంశాలను సరిచేసి రెండు, మూడు రోజుల్లో అధికారులు అమలు చేస్తారని తెలిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos