భాజపా సర్కారు కలే

భాజపా సర్కారు కలే

ముంబై: మహా రాష్ట్రలో భాజపా ప్రభుత్వాన్ని ఏర్పాటు కానివ్వబోమని కాంగ్రెస్ పార్టీ నేత హుస్సేన్ దల్వాయ్ పేర్కొన్నారు. అధిష్టానం ఆదేశాలకు అనుగుణంగా శాసనసభ్యులు నడుచుకుంటారన్నారు. ‘‘కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా కలిసే ఉన్నారు. పార్టీ నుంచి ఒక్క ఎమ్మెల్యే కూడా బయటికి వెళ్లడు. పార్టీ అధిష్టానం ఏం చెబితే ఎమ్మెల్యేలు అలా చేస్తారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభు త్వాన్ని ఏర్పాటు కానివ్వబోం. ఎన్సీపీ మా మిత్రపక్షం. వాళ్లు మాతోనే ఉన్నారు. మహారాష్ట్రను కాపాడేందుకే ప్రజలు మాకు ఓటేశార’న్నారు. ఎన్నికలకు ముందు భాజపాలో చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇప్పుడు మళ్లీ తిరిగి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నా రని చెప్పారు. తాము ఎన్సీపీతో కలిసే అన్ని నిర్ణయాల్నీ తీసుకుంటామని చెప్పారు. శనివారానికి మహా రాష్ట్ర శాసన సభ గడు వు తీరనుంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos