రెండు రోజుల క్రితం హైదరాబాద్ నగరంలోని హైటెక్సిటీ మెట్రో రైల్వేస్టేషన్ వద్ద తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు స్వాధీనం చేసుకున్న రూ.2 కోట్ల డబ్బు రాజమండ్రి ప్రస్తుత ఎంపీ మురళీమోహన్కు చెందిన డబ్బుగా పోలీసులు గుర్తించారు.మురళీ మోహన్కు చెందిన సంస్థ జయభేరి కన్స్ట్రక్చన్స్ ఉద్యోగులు శ్రీహరి,పండరి రూ.2 కోట్ల నగదు తీసుకెళుతుండగా హైటెక్సిటీ మెట్రోస్టేషన్ వద్ద తనిఖిలు చేస్తున్న పోలీసుల నగదు స్వాధీనం చేసుకున్నట్లు పోలీస్ కమిషనర్ సజ్జనార్ తెలిపారు.రైలు ద్వారా రూ.2 కోట్ల నగదును ప్రస్తుత రాజమండ్రి ఎంపీ మురళీమోహన్కు అందించడానికి తీసుకెళుతున్నట్లు పట్టుబడ్డ ఉద్యోగులు అంగీకరించారంటూ సజ్జనార్ తెలిపారు.జయభేరి సంస్థకు చెందిన ధర్మరాజు, జగన్మోహన్రావు ఆదేశాలతో శ్రీహరి,పండరిలు ఈ డబ్బును రైలు ద్వారా రాజమండ్రికి తీసుకెళ్లడానికి సిద్ధమయ్యారని వెల్లడించారు.రాజమండ్రికి చేరుకున్న అనంతరం అక్కడ యలమంచిలి మురళీకృష్ణ అనే వ్యక్తికి నగదు ఉన్న బ్యాగులు అందజేయాలంటూ ధర్మరాజు,జగన్మోహన్రావులు తమకు ఆదేశించినట్లు పట్టుబడ్డ వ్యక్తులు వెల్లడించారన్నారు.దీంతో నగదు తరలిస్తున్న శ్రీహరి,పండరిలతో పాటు ధర్మరాజు,జగన్మోహనరావు,యలమంచిలి మురళృకృష్ణ,జయభేరి సంస్థ చైర్మన్ మురళీమోహన్లపై కేసులు నమోదు చేసినట్లు కమిషనర్ సజ్జనార్ తెలిపారు..