కూచ్ బెహర్ : హోం మంత్రి అమిత్ షా ఆదేశాల మేరకు బంగాల్లో ఓటర్లను సీఆర్పీఎఫ్ సిబ్బంది వేదిస్తున్నారని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. జిల్లాలో వవివిధ ప్రాంతాల్లో జరిగిన ఎన్నికల ప్రచార బహిరంగ సభల్లో పాల్గొన్నారు. ‘ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకోకుండా సిబ్బంది అడ్డుకుంటున్నారు. శాసనసభ ఎన్నికల ప్రచారం సందర్భంగా జరిగిన హింసలో 10 మంది చనిపోయారు. ఎవరూ ప్రాణాలు కోల్పోకుండా ఎన్నికల సంఘం చర్యలు చేపట్టాలి. సీఆర్పీఎఫ్ సిబ్బందిపై ఈసీ పర్యవేక్షణ ఉంచాలి. నిజమైన జవాన్లను నేను గౌరవిస్తాను. మహిళలపై దాడులు చేసే వారిని, ప్రజలను వేధించే వారిని కాద’ని తెలిపారు.