తాప జనక పేగు వ్యాధి(క్రోన్స్)కి సెయింట్ థామస్ బయోమెడికల్ రీసెర్చ్ సెంటర్(బీఆర్సీ) పరిశోధకులు కొత్త సెల్ థెరపీని పరిచయం చేశారు. ఈ వ్యాధితో బాధ పడుతున్న వ్యక్తి నుంచి తెల్ల రక్త కణాలను సేకరించి.. శుద్ధి చేసిన కణాలను తిరిగి సిరల ద్వారా తిరిగి అతడి శరీరంలోకి ఎక్కించారు. ఈ పరీక్షలు సత్ఫలితాలనివ్వడం గమనార్హం.
క్రోన్స్ జీర్ణ క్రియను దెబ్బతీస్తుంది. దీనిని ఉపేక్షిస్తే అతిసారం, అలసట, బరువు తగ్గడం వంటి ఇబ్బందులు పీడిస్తాయి. ఈ వ్యాధికి ఇదీ కారణం అని ప్రత్యేకంగా చెప్పలేం.