కర్నూలు : రాజధాని గురించి భాజపాలోనే కాదు సీపీఐలోనూ అభిప్రాయ భేదాలు మొదలయ్యాయి. ముఖ్యమంత్రి జగన్ మోహ న్ రెడ్డి చేసిన మూడు రాజధానుల ప్రతిపాదనను సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ వ్యతిరేకిస్తున్నారు. సిపీఐ కర్నూలు నేతలు మూడు రాజధానుల ప్రతిపాదనను సమర్థించారు. సోమవారం ఇక్కడ ఆ పార్టీ జిల్లా నేతలు సమావేశమై అధికార వికేంద్రీ కరణకు అనుకూలంగా తీర్మానించారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తీరును వ్యతిరే కించారు. చంద్రబాబు అధికారం లో ఉండగా హెూదా కోసం విద్యార్ధులు ఉద్యమిస్తే కేసులు పెట్టిన విషయాన్ని గుర్తు చేశారు. అమరావతిని తాత్కాలిక రాజధానిగా మార్చింది చంద్రబాబేనని ధ్వజమెత్తారు.