హొసూరు : కృష్ణగిరి జిల్లా సూలగిరి యూనియన్లో కరోనా వ్యాప్తి నిరోధానికి పకడ్బందీ చర్యలు చేపట్టారు. యూనియన్లోని 13 పంచాయతీల పరిధిలోని గ్రామాలలో కరోనా నిరోధక మందులను పిచికారి చేయాలని సూలగిరి యూనియన్ చైర్పర్సన్ లావణ్యా హేమనాథ్ అధికారులను ఆదేశించారు. అందులోభాగంగా అధికారులు గ్రామాలలో మందులు పిచికారి చేయడానికి చర్యలు చేపట్టారు. ఇందుకు అవసరమైన క్రిమి సంహారక మందులు, స్ప్రేయర్లను లావణ్యా హేమనాథ్ సమకూర్చారు. అన్నిగ్రామాలలో మందులను పిచికారి చేయాలని ఆదేశించారు. అదేవిధంగా గ్రామాలలో క్షేత్ర స్థాయి పర్యటన చేసే అధికారులు తాగు నీరు, ఇతర సమస్యలు ఉన్నాయా అని ప్రజలను అడిగి తెలుసుకుని వెంటనే పరిష్కరించాలని ఆమె ఆదేశించారు. సూలగిరి బీడీవోలు విమల్, బాలాజీ, గ్రామ స్థాయి అధికారులు ఆమె వెంట ఉన్నారు.