ఉగ్రవాదుల కుట్ర భగ్నం

ఉగ్రవాదుల  కుట్ర భగ్నం

శ్రీనగర్:బుద్గాం జిల్లా కనిపోరా ప్రాంతంలో అత్యాధునిక పేలుడు పదార్థాలతో భారత జవాన్ల వాహన శ్రేణి పై దాడి చేయాలనే కుట్రను భద్రతా బలగాలు భగ్నం చేశాయి. కనిపోరా వద్ద శుక్రవారం ఉదయం ఒక ఉగ్రవాదిని భద్రతా బలగాలు కాల్చి చంపాయి. అనంతరం పోలీసు అధికారి ఒకరు విలేఖ రులకు ఉగ్రవాదుల కుట్ర గురించి వివరించారు. ‘గత కొన్ని రోజులుగా కొందరు ఉగ్రవాదుల కదలికలను గమనిస్తున్నాం.పేలుడు పదార్థాలతో భారత సైన్యం లేదా భద్రతా బలగాల వాహన శ్రేణి పై వారు దాడి చేసే అవకాశం ఉన్నట్లు గుర్తించాం. కాల్పులు జరిగిన ప్రాంతంలో గాలింపులు జరిపి నపుడు ఒక ఇంట్లో దాక్కున్న ఉగ్రవాదుల వద్ద భద్రతా వాహనాల కదలికల సమాచారం ఉన్నట్లు అంచనా వేసాం. భద్రతా బలగాలు ఆ ఇంటిని చుట్టు ముట్టగానే ఉగ్రవాదులు గ్రెనేడ్లు విసిరి, కాల్పులు ప్రారంభించారు. ఎదురు కాల్పుల్లో ఒక ఉగ్రవాది ఒకరు చనిపోయారు. ఆ ఇంట్లో ఎంత మంది ఉగ్రవాదులు ఉన్నారనే విషయంలో స్పష్టత లేదు. చీకటిగా ఉండటంతో ఉగ్రవాదలు ఎందరు ఉన్నారో గుర్తించలేక పోయాం. మరో ఇద్దరు తప్పించు కున్నట్టు భావిస్తున్నామ’ని విపులీకరించారు. పుల్వామా దిశగా రహదారి మార్గంలో వారు వెళ్లి ఉంటారని పోలీసులు అనుమానించారు. శ్రీ నగర్ హైవేకు మూడు కి.మీల దూరంలో ఉన్న ఆ ఇంటిని టెర్రరిస్టులు స్థావరంగా చేసుకున్నారన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos