మోదీ…బాటసారికి కాంగ్రెస్ టికెట్టు

ముక్తికాంత బిస్వాల్‌

భువనేశ్వర్..ఒడిశాకు చెందిన ముక్తికాంత బిస్వాల్‌కు అనూహ్యంగా శాసన సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిత్వం లభించింది. రూర్కెలా నియోజకవర్గం నుంచి ఈయన పోటీ చేయనున్నారు. రూర్కెలా సమీపంలోని గ్రామానికి చెందిన 31 ఏళ్ల ముక్తికాంత ప్రధాని మోదీ ఇచ్చిన హామీని గుర్తు చేసేందుకు గత ఏడాది 71 రోజుల పాటు 1,500 కిలోమీటర్ల దూరం కాలి నడకన వెళ్లారు. రూర్కెలా వద్ద ఉన్న ఇస్పాత్ జనరల్ ఆస్పత్రిలో మంచి వైద్య సదుపాయాలు కల్పిస్తామని 2015లో మోదీ హామీ ఇచ్చారు. రెండేళ్లు గడిచినా ఆ హామీ అమలు కాకపోవడంతో ముక్తికాంత కాలినడకన ఢిల్లీ వెళ్లారు. ఆయన ఢిల్లీ చేరుకున్నప్పటికీ ప్రధాని మోదీని కలుసుకోలేకపోయారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos