బీజేపీలో చేరకముందే కోమటరెడ్డిపై చర్యలకు సిద్ధమైన ఏఐసీసీ..

కాంగ్రెస్‌ అధిష్టానంపై,నేతలపై విమర్శలు చేసిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డిపై చర్యలు తీసుకోవడానికి కాంగ్రెస్‌ అధిష్టానం సిద్ధమైంది.కాంగ్రెస్‌ అధిష్టానంపై,నేతలపై కోమటరెడ్డి రాజగోపాలరెడ్డి చేసిన వ్యాఖ్యలపై పూర్తి వివరాలు అందించాలంటూ ఏఐసీసీ క్రమశిక్షణ కమిటీ టీపీసీసీ కోరింది.దీంతో ముందస్తు ఎన్నికల్లో తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ గా మల్లు భట్టి విక్రమార్కను నియమించిన సందర్భంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను నివేదికలో పొందుపరిచింది.తన నియోజకవర్గంలో గెలవలేని వ్యక్తి ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్ గా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువస్తారంట అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.అంతేకాదు ఆనాడు కాంగ్రెస్ అధిష్టానం చేసిన వ్యాఖ్యలపై సైతం పూర్తి నివేదిక అందజేసినట్లు తెలుస్తోంది.ఈ నివేదికలన్నింటిని పరిశీలించిన ఏఐసీసీ క్రమశిక్షణ కమిటీ కాంగ్రెస్ పార్టీలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారానికి ముగింపు పలకాలని నిర్ణయం తీసుకుంది.ఈనెల 6న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరతారంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో బీజేపీలో చేరే ముందే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకత్వంతోపాటు ఏఐసీసీ అధిష్టానం నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos