న్యూఢిల్లీ: రాజస్థాన్ లో రాజకీయ సంక్షోభం ఏర్పడిన తర్వాత ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ బుధవారం ఢిల్లీలో కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీతో సమావేశం కానున్నారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్ష పదవికి నామపత్రం దాఖలా చేయాలో? వద్దో? అనే విషయాన్ని గెహ్లాట్ తేల్చుకోనున్నారు. అదే సమయంలో గెహ్లాట్ను రాజస్థాన్ ముఖ్యమంత్రిగా కొనసాగించాలా? వద్దా? అనే దానిపై కూడా కాంగ్రెస్ అధిష్ఠానం నుంచి ప్రకటన వెలువడే అవకాశం కనిపిస్తోంది.