అధ్యక్ష ఎన్నిక బరిలో శశి థరూర్

అధ్యక్ష ఎన్నిక బరిలో శశి థరూర్

న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి జరుగుతున్న ఎన్నికల్లో ఆ పార్టీ ఎంపీ శశి థరూర్ పోటీ చేయనున్నారు. ఆయన ప్రతినిధి ఒకరు శనివారం పార్టీ ప్రధాన కార్యాలయం నుంచి నామపత్రాల్ని తీసుకున్నారు. దీంతో అశోక్ గెహ్లాట్ , శశి థరూర్ మధ్య పోటీ జరగబోతోంది. నామ పత్రాల దాఖలు ప్రక్రియ శనివారం ప్రారంభమైంది. అశోక్ గెహ్లాట్కు ఆ పార్టీ అధిష్ఠానం అండదండలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. పార్టీని సమూలంగా ప్రక్షాళన చేయాలని సోనియా గాంధీకి లేఖ రాసిన 23 మంది కాంగ్రెస్ నేతల్లో శశి థరూర్ ఒకరు. సీతారాం కేసరి నుంచి 1998లో ఆ పార్టీ పగ్గాలను సోనియా గాంధీ స్వీకరించారు. సీతారాం కేసరి 1997లో శరద్ పవార్, రాజేశ్ పైలట్లను ఓడించి, ఆ పదవిని చేపట్టారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos