మెరిసిన కామ్రేడ్స్

మెరిసిన కామ్రేడ్స్

పట్నా: బిహార్లో మహాకూటమితో జతకట్టి బరిలోకి దిగిన వామపక్షాలు 19 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. మొత్తం 29 స్థానాల్లో వామ పక్షాలు పోటీ చేశాయి. మహాకూటమికి నేతృత్వం వహించిన ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ పార్టీ నేతలు వారించినప్పటికీ వామపక్షాలకు 29 సీట్లను కేటాయించారు. ఇది కలిసొచ్చినట్లే కనిపిస్తోంది. సీపీఐ(ఎం) 4, సీపీఐ 6, సీపీఐ (ఎమ్ఎల్) 19 సీట్లలో పోటీ చేశాయి. 2010 ఎన్నికల్లో సీపీఐ ఒక్క స్థానంలో గెలుపొందగా, 2015లో సీపీఐ (ఎమ్ఎల్) మూడు చోట్ల గెలుపొందింది. బంగతో సహా ఈశాన్య రాష్ట్రాల్లోనూ తమ ప్రాభవాన్ని కోల్పోయిన తరుణంలో బిహార్లో కామ్రేడ్లు పుంజుకోవడం వామపక్షాలను పునరుత్తేజాన్నిచ్చేలా కనిపిస్తుంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos