కశ్మీర్‌లో హింసకు సంకేతాలు

కశ్మీర్‌లో హింసకు సంకేతాలు

న్యూ ఢిల్లీ: కశ్మీర్లో అలజడికి పాకిస్తాన్ సైన్యం, ఉగ్రసంస్థల అధినేతలు తమ అనుచరులకు సంకేత భాషాల్లో సందేశాల్ని పంపుతున్నట్లు భారత నిఘా వర్గ సంస్థలు గుర్తించాయి. దరిమిలా పలు ఎఫ్ఎం ట్రాన్స్మిషన్ స్టేషన్లను సరిహద్దు రేఖ సమీపానికి పాక్ తరలించిందని కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. కశ్మీర్లో దాడులు చేయాలని ఈ కేంద్రాల నుంచి ఉగ్ర వాదులకు సందేశాలను పంపిస్తున్నారని వివరించారు. సంప్రదింపుల కోసం ఉగ్ర వాద సంస్థలు జైష్ మొముమ్మద్ (68/69), లష్కేరే తోయిబా (ఏ3), ఆల్ బద్ర్ (డీ9) సంకేతాలు వాడు తున్నారని చెప్పారు. సైన్యం, ఉగ్ర సంస్థలు, పాకిస్తాన్ జాతీయ గీతమైన ‘క్వామీ తరనా’ ద్వారా సందేశాలు పంపుతు న్నారని నిఘా వర్గాలు గుర్తించాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos