అమరావతి : రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ఈ నెల 30న విజయవాడలోని ఇందిరాగాంధీ పురపాలక క్రీడాంగణంలో ఉదయం 11.40 నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్య ప్రమాణం చేయనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ వేడుకకు పెద్ద సంఖ్యలో ప్రజలు, పార్టీ శ్రేణులు రానున్నారు. అందుకు తగిన ట్లు ఏర్పాట్లు చేయాలని ప్రధాన కార్యదర్శి సుబ్రహ్మణ్యంను జగన్ కోరినట్లు తెలిపారు. విజయవాడ నగర పోలీసు కమిషనరు ద్వారకా తిరుమలరావు శుక్రవారం ఉదయం జగన్తో ప్రమాణ కార్యక్రమ ఏర్పాట్ల గురించి చర్చించారు.