హొసూరు : తమిళనాడు ముఖ్యమంత్రి ఎడపాడి పళని స్వామికి క్రిష్ణగిరిలో ఏడీఎంకే పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. సేలంలో వివిధ అభివృద్ధి పనుల శంకుస్థాపనకు ముఖ్యమంత్రి చెన్నై నుంచి రోడ్డు మార్గంలో కారులో సేలం బయలుదేరారు. క్రిష్ణగిరిలో జిల్లా కలెక్టర్ ప్రభాకరన్, మాజీ మంత్రి బాలకృష్ణారెడ్డి, పార్టీ కో-ఆర్డినేటర్, మాజీ మంత్రి కేపీ. మునుస్వామి, మాజీ ఎంపీ అశోక్ కుమార్, పార్టీ ముఖ్యమంత్రికి ఘనస్వాగతం పలికారు. భారీ సంఖ్యలో ప్రజలు, పార్టీ కార్యకర్తలు ముఖ్యమంత్రిని చూడడానికి రావడంతో కృష్ణగిరి-సేలం రోడ్డులో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.