ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు సంబంధించి ఓ ఆసక్తికర వార్త ఇప్పుడు హాట్టాపిక్గా మారింది.తెదేపా ఎమ్మెల్యే తెలుగు సీనియర్ హీరో బాలకృష్ణ-వైఎస్ జగన్ల మధ్య ఉన్న అనుబంధం గురించి ఓ వార్త నెట్టింట్లో వైరల్గా మారింది.ఓ 25 ఏళ్ల ప్రాయంలో రాజకీయాలతో సంబంధం లేని సమయంలో కొత్తగా వ్యాపారాల గురించి తెలుసుకుంటున్న వైఎస్ జగన్కు ప్రతిపక్ష నేత తనయుడిగానే కాకుండా కడప జిల్లా వరకు మరొక హోదా ఉండేదట.అది మరేంటో కాదు కడప జిల్లా నందమూరి బాలకృష్ణ అభిమానుల సంఘం అధ్యక్షుడు.తండ్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి బాలకృష్ణ తండ్రి ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా పోరాటాలు చేస్తున్నా వైఎస్ జగన్ మాత్రం అవేమి పట్టించుకోకుండా బాలకృష్ణ సినిమాలు తెగ ఇష్టంగా చూసేవారట.బాలయ్య సినిమా విడుదలైందంటే చాలు జిల్లాలో వైఎస్ జగన్ హంగామా మొదలయ్యేదట.సినిమా విడుదలైన,విజయం సాధించినా పత్రికల్లో ప్రకటనలు ఇచ్చి మరీ తన అభిమానాన్ని చాటుకునేవారట.ఈ క్రమంలో 1999వ సంవత్సరంలో విడుదలై బాలకృష్ణ కెరీర్లో మైలురాయిగా నిలిచిన సమరసింహారెడ్డి ఘన విజయం సాధించిన సందర్భంగా 2000వ సంవత్సరంలో వైఎస్ జగన్ ఇచ్చిన ప్రకటనకు సంబంధించిన ఫోటో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.చిన్నప్పటి నుంచి బాలకృష్ణపై అభిమానం పెంచుకున్న వైఎస్ జగన్ ఇప్పటికీ బాలయ్యను హీరోగా అభిమానిస్తూనే ఉంటున్నారని టాక్.రాజకీయాల్లోకి ప్రవేశించాక వ్యాపారాలు,సినిమాల గురించి పూర్తిగా పట్టించుకోవడం మానేసిన వైఎస్ జగన్ బాలయ్యను మాత్రం అభిమానిస్తూనే ఉంటున్నారని టాక్ వినిపిస్తోంది.అందుకే ఇన్నేళ్లలో తెదేపాపై ప్రతీరోజూ విరుచుకుపడే వైఎస్ జగన్ బాలయ్యను విమర్శించిన సందర్భాలు చాలా తక్కువని చెబుతున్నారు.తాజాగా జరిగిన శాసనసభ ఎన్నికల్లో సైతం బాలకృష్ణపై ఉన్న అభిమానంతోనే హిందూపురంలో ప్రచారం చేసినా బాలకృష్ణకు వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడలేదని టాక్ వినిపిస్తోంది..