సుప్రీంకోర్టు ప్రధానన్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ విజయవాడకు చేరుకున్నారు. జస్టిస్ రంజన్ కు ఏపీ హైకోర్టు రిజిస్టార్ స్వాగతం పలికారు. రంజన్ తో పాటు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ సుభాష్ రెడ్డి కూడా విజయవాడ చేరుకున్నారు. అమరావతిలో నూతనంగా నిర్మించిన తాత్కాలిక భవనంలో రేపు ఏపీ హైకోర్టు ప్రారంభ కార్యక్రమం ఉండగా ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా జస్టిస్ రంజన్ గొగోయ్ పాల్గొననున్నారు. చీఫ్ జస్టిస్ కు ఏపీ పోలీసులు గౌరవ వందనం సమర్పించి స్వాగతం పలకగా విజయవాడ నోవాటెల్ హోటల్ లో రంజన్ బసచేయనున్నారు.