నాట్టింగ్హామ్ : ప్రపంచ కప్పులో బిజీగా ఉన్న టీమిండియా సభ్యులు కాసేపు ఆటవిడుపుగా హిందీ చిత్రాన్ని తిలకించారు. నాట్టింగ్హామ్లోని ఓ థియేటర్లో ప్రదర్శిస్తున్న భారత్ సినిమాను కేదార్ జాదవ్, ఎంఎస్ ధోనీ, హార్ధిక్ పాండ్యా, కేఎల్ రాహుల్, శిఖర్ ధావన్ తదితరులు మంగళవారం వీక్షించారు. ఈ సినిమాలో సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ జంటగా నటించారు. సల్మాన్ అభిమాని అయిన జాదవ్ ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడిస్తూ, ఆటగాళ్లతో కలసి దిగిన ఫొటోను అభిమానులతో పంచుకున్నారు. కేదార్ ట్వీట్కు సల్మాన్ స్పందిస్తూ భారత్ సినిమాను చూసినందుకు థాంక్యూ చెప్పారు.