నితీశ్ కు పరాభవం తప్పదు

నితీశ్ కు పరాభవం తప్పదు

పాట్నా: బీహారు శాసనసభ ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజు నితీశ్కుమార్, మహాకూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వీ యాదవ్ ఎదుట తలవంచక తప్పదని ఎల్జేపీ నేత చిరాగ్ పాశ్వన్ వ్యాఖ్యానించారు. గురు వారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడారు. ‘నువ్వు ( సీఎం వ్యాఖ్యానితీశ్ కుమార్) ఏ ప్రధానితో అయితే ఎప్పుడు గొడవపడుతూ, విమర్శిస్తూ ఉంటావో ఇప్పుడు నీ కోసం ఓట్లు అడగమని అతని ముందే తల దించావు. దీన్ని బట్టే నీకు ముఖ్యమంత్రి పదవి అన్న, ఆ అధికారం అన్న ఎంత ఆశ ఉందో అర్ధం అవుతోంది. నవంబర్ 10 తరువాత నువ్వు తేజస్వీ యాదవ్ ముందు తలవంచక తప్పదు’ అని అన్నారు. ‘ ఆర్టికల్ 370, సీఏఏ విషయంలో నితీశ్ విబేధించారు. ఇప్పుడు ఎన్నికల సమయంలో మద్దతు కోసం నితీశ్ కేంద్ర ప్రభుత్వంతో ఉన్న విబేధాలను మర్చిపోయారు. గత 15 సంవత్సరాల పాటు అధికారంలో ఉండి కూడా బిహార్ను అభివృద్ధి పరచలేద’ని విమర్శించారు. నితీశ్ కుమార్ ఇప్పటి వరకు ఐదు సార్లు బిహార్కు ముఖ్యమంత్రిగా పని చేసారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos