మాంసాహారం అంటే మనకు ఠక్కుమని గుర్తుకు వచ్చే వంటకాలంటే కోడి,మేక,చేపలు ఇంకొంచెం ముందుకెళితే పిట్టలు మొదలైనవి మాత్రమే తెలుసు.కానీ ఆహారం విషయంలో ప్రపంచంలోని అన్ని దేశాలపైకి కొంచెం భిన్నంగా ఉండే చైనాలో కప్పలు,పాములు చివరకు ఎలుకలు తిన్న ఘటనలు కూడా ఇది వరకే చూశాం.తాజాగా నాలో ఓ అమ్మాయి గబ్బిలాన్ని తింటున్నప్పుడు తీసిన వీడియో వైరల్ అవుతోంది. ఓ రెస్టారెంట్లో కూర్చున్న ఆమె గబ్బిలంతో చేసిన సూప్ను కూడా తాగేసింది. వండిన గబ్బిలాన్ని ఆమె ఎంత ఇష్టంగా తిందంటే.. మాంసమే కాకుండా దాని చర్మాన్ని కూడా తీనేందుకు యత్నించింది. చర్మం తినకూడదని అక్కడే ఉన్న ఓ వ్యక్తి ఆమెకు చెప్పారు.చైనాలో కరోనా వైరస్ కలకలం రేపుతోన్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు 17 మంది ప్రాణాలు బలిగొని, మరో 600 మందికి వ్యాపించింది. పాము, గబ్బిలాల నుంచే ఈ వైరస్ మనుషులకు వ్యాపించినట్టు పెకింగ్ యూనివర్సిటీ పరిశోధకులు అభిప్రాయపడ్డారు. అయినప్పటికీ చైనా యువతి ఇలా గబ్బిలాన్ని తినేసింది.
A bat(-eating) woman from China… pic.twitter.com/D8JNvClxy4
— Byron Wan (@Byron_Wan) January 23, 2020