న్యూ ఢిల్లీ : భారత భూభాగమైన లద్దాఖ్లోని కొంత ప్రాంతాన్ని డ్రాగన్ దేశం ఆక్రమించుకుంది. ఇంత జరగుతున్నా ప్రధాని మోదీ మాత్రం మన భూభాగంలోకి ఎవరూ రాలేదని మత్తులో ఉన్నట్లుగా మాట్లాడుతన్నార’ని కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ ఎంపీ సుబ్రమణియన్ స్వామి ట్వీట్లో ధ్వజ మెత్తారు. మాజీ ప్రధానులు జవహర్లాల్ నెహ్రూ, అటల్ బిహరీ వాజ్పేయీల మూర్ఖత్వం వల్లే ఇవాళ టిబెట్, తైవాన్లు చైనాలో భాగమయ్యాయని ఆరోపించారు. వారి వల్లే మనమంతా దీన్ని అంగీకరించాల్సి వచ్చింద న్నారు. పరస్పర అంగీకారంతో కుదుర్చుకున్న వాస్తవాధీన రేఖ ఒప్పందాన్ని కూడా చైనా గౌరవించడం లేదన్నారు.