అధిక పిల్లలుంటే రూ.లక్ష బహుమతి

అధిక పిల్లలుంటే రూ.లక్ష  బహుమతి

ఐజ్వాల్ (మిజోరం) : మిజోరం ప్రభుత్వం అధిక సంఖ్యలో పిల్లలున్నవారికి రూ.లక్ష నగదు బహుమానాన్ని ప్రకటించింది. ప్రశంసా పత్రం, స్మరణికనూ ఇస్తామని పేర్కొంది. దీని గురించి మంత్రి రాబర్ట్ రోమావియా రాయ్టే మాట్లాడారు. ‘ 2011 జనాభా లెక్కల ప్రకారం మిజోరం జనాభా 10,91,014. అతి తక్కువ జన సాంద్రత ఉన్న ప్రాంతంగా పేరొందింది. మిజో జనాభా తగ్గుతుండటం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఐజాల్ ఈస్ట్ -2 అసెంబ్లీ నియోజకవర్గంలో అత్యధిక సంఖ్యలో సంతానం ఉన్న సజీవ పురుషుడు, లేదా స్త్రీకి రూ. లక్ష నగదు బహుమతిని ఇస్తాం. ప్రోత్సాహక బహుమతి ఖర్చును తన కుమారుడి యాజమాన్యంలోని నిర్మాణ కన్సల్టెన్సీ సంస్థ భరిస్తుంద’ని వివరించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos