ముఖ్యమంత్రికి కోపమొచ్చింది…

ముఖ్యమంత్రికి కోపమొచ్చింది…

ప్రతిపక్ష వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ ఏలూరులో నిర్వహించిన బీజీ
గర్జన సభకు సంబంధించి ముందస్తు నివేదిక ఇవ్వకపోవడంతో తెదేపా అధినేత,ముఖ్యమంత్రి చంద్రబాబు
నాయుడు పోలీసులు,ఇంటలిజెన్స్‌ అధికారులతో పాటు పార్టీ నేతలపై కూడా తీవ్ర అసహనం వ్యక్తం
చేసినట్లు తెలుస్తోంది.సభకు ఎంతమంది వస్తారో,సభావేదికపై ఎవరెవరూ మాట్లాడతారో,సభా ముఖంగా
జగన్‌ ఎటువంటి హామీలు ఇచ్చే అవకాశం ఉందో తదితర వాటిపై ముందస్తు నివేదికలు ఎందుకు ఇవ్వలేకపోయారంటూ
ఆగ్రహం వ్యక్తం చేసారు.ఆ నివేదిక ఆధారంగా అటు ప్రభుత్వ పరంగాను – ఇటు పార్టీ పరంగాను చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని – ఇప్పుడు ఆ నివేదిక రాకపోవడంతో చేష్టలుడిగి చూస్తున్నామని ఇంటేలిజెన్స్ అధికారులపై మండిపడినట్లు సమాచారం. బీసీ గర్జనకు ముందు నివేదిక ఇవ్వకపోయిన గర్జన ముగిసిన తర్వాతైన అధికారులు స్పందించాలి కదా అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు. బీసీ గర్జన ముగిసిన తర్వాత ఏ ప్రాంతం నుంచి ఎంతమంది వచ్చారు….. గర్జనకు వచ్చిన వారిలో ప్రభుత్వ వ్యతిరేకత ఎంత ఉంది… వారంతా స్వచ్చందంగా వచ్చారా… లేక డబ్బుల కోసం వచ్చారా వంటి వివరాలతో నివేదిక ఇవ్వాలని ఆ పనిని ఇప్పటికి చేపట్టకపోవడం అధికారుల నిర్లక్ష్యమేనని మండిపడినట్లు సమాచారం.ఇక తెలుగుదేశం పార్టీ వైపు నుంచి కూడా నాయకులు సరిగా స్పందించలేదని – చంద్రబాబు నాయుడు వారిని మందలించినట్లు చెబుతున్నారు. బీసీ గర్జన ముగిసిన వెంటనే అన్ని జిల్లాలకు చెందిన తెలుగుదేశం పార్టీ బీసీ నాయకులు స్పందించాలని – ఇక్కడ అలాంటిదేమి జరగకపోవడంతో చంద్రబాబు మండిపడినట్లు చెబుతున్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిమిడి కళావెంకట్రావు ఒక బహిరంగ లేఖ రాసి చేతులు దులుపుకున్నారని.. ఇలాగేనా స్పందించడం అంటూ చంద్రబాబు మండిపడినట్లు చెబుతున్నారు. ఇప్పటికైన పార్టీ బిసీ నాయకులు జగన్ వ్యాఖ్యలని ఖండిస్తు విలేఖరుల సమావేశాలు నిర్వహించాలని – బిసీలు దూరమైతే పార్టీకి తీవ్ర నష్టం వస్తుందని గ్రహించాలని హెచ్చరించినట్లు చెబుతున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos