రఘురాజు ఇంటిపై సీబీఐ దాడులు

రఘురాజు ఇంటిపై సీబీఐ దాడులు

హైదరాబాద్: నరసాపురం లోక్‌ సభ నియోజక వర్గం వైకాపా అభ్యర్థి, పారిశ్రామికుడు, రఘు రామకృష్ణంరాజు ఇంట్లో మంగళవారం ఉదయం నుంచి సీబీఐ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఇక్కడి గచ్చిబౌలిలోని ఎమ్మార్ ప్రాపర్టీస్‌లో రఘరామకృష్ణంరాజు నివాసం ఉంటున్నారు. సోదాలకు గల కారణం ఇప్పటి వరకూ తెలియలేదు. గతంలో బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాల బకాయిల్ని రఘురామకృష్ణంరాజు యాజమాన్యంలోని వ్యాపార సంస్థలు సకాలంలో చెల్లించలేదనే ఆరోపణలున్నాయి. బ్యాంకులకు బకాయి ఎగవేత కేసులోనే సీబీఐ గతంలో ఒక సారి ఇదే నివాసం పై దాడి చేసింది.ప్రస్తుతం సోదాలు చేస్తున్న అధికార్లలో పలువురు బెంగళూరు నుంచి వచ్చిన వారని తెలిసింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos