వచ్చారు.. సోదా చేశారు. ఏమీ దొరకలేదు

వచ్చారు.. సోదా చేశారు. ఏమీ దొరకలేదు

న్యూఢిల్లీ :ప్రాథమిక సమాచార నివేదికలో తన పేరు లేకపోయినా సీబీఐ అధికారులు తన ఇంట్లో సోదాలు నిర్వహించారని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పి.చిదంబరం తప్పుపట్టారు. మంగళవారం ఆయన, ఆయన కుమారుడు కార్తీ చిదంబరం ఇళ్లపై సీబీఐ సోదాలు నిర్వహించింది. అనంతరం ట్విట్టర్ ద్వారా చిదంబరం స్పందిం చారు. ‘‘ఈరోజు ఉదయం, చెన్నైలోని నా నివాసంలో ఢిల్లీలోని నా అధికారిక నివాసంలో సీబీఐ టీం సోదాలు నిర్వహించింది. సీబీఐ అధికారులు నాకు ఒక ఎఫ్ఐ ఆర్ కాపీని చూపించారు. అయితే అందులో నేను నిందితుడని అందులో లేదు. వచ్చారు.. సోదా చేశారు. వాళ్లకి ఏమీ దొరకలేదు. వాళ్లేమీ సీజ్ చేయలేదు. అయితే ఒక టైతే నేను గమనించారు. వాళ్లు సోదాలు చేస్తున్నప్పుడు చాలా ఆసక్తికరంగా అనిపించింది’’ అనే అర్థంలో ట్వీట్ చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos