బద్రి చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన అమిషా పటేల్ అనంతరం ఒకట్రెండు తెలుగు చిత్రాల్లో కనిపించినా అనంతరం పూర్తిగా హిందీకే పరిమితమయ్యారు.హిందీలో చెప్పుకోదగిన చిత్రాల్లో నటించినా కొత్త హీరోయిన్ల తాకిడి పెరగడంతో అమిషా పటేల్కు క్రమంగా క్రేజ్ తగ్గింది.మరోవైపు వయసు కూడా మీద పడడడంతో సినిమా అవకాశాలు పూర్తిగా తగ్గడంతో ఫోటోషూట్లతో కాలం గడుపుతోంది.తాజాగా రుణం ఎగవేత,చెక్బౌన్స్లకు సంబంధించి న్యాయస్థానం సమన్లు జారీ చేయడంతో అమిషా పటేల్కు ఇబ్బందులు తలెత్తాయి.సినిమాల్లో అవకాశాలు పూర్తిగా తగ్గిపోవడంతో ఖాళీగా ఉంటున్న అమిషాపటేల్ కొద్ది రోజుల క్రితం ఓ సినిమా కథ నచ్చడంతో తనే నిర్మాతగా మారి సినిమా తీయడానికి సిద్ధమయ్యారు.అందుకోసం అజయ్ కుమార్ సింగ్ అనే వ్యక్తి దగ్గర రూ.3 కోట్లు అప్పు తీసుకొని చిత్రీకరణ ప్రారంభించగా కొన్ని కారణాల వలన సినిమా షూటింగ్ ఆగిపోయింది. దీంతో రుణం చెల్లించాలంటూ ఫైనాన్షియర్ ఒత్తిడి చేయడంతో కొద్ది కాలం రోజుల క్రితం చెక్కు ఇచ్చారు.అమిషా ఇచ్చిన చెక్కును బ్యాంకులో జమ చేయగా నిదులు లేక బౌన్స్ కావడంతో సదరు ఫైనాన్షియర్ అమిషాపై కేసు వేయడంతో రాంచీ కోర్టులో కేసు ఫైల్ అయింది.దీనిపై విచారణ జరిపిన కోర్టు ఈ నెల 8న కోర్టుకి హాజరు కావాలంటూ అమిషాపటేల్కు సమన్లు జారీ చేసింది.లేదంటే అరెస్ట్ వారెంట్ జారీ చేస్తామని హెచ్చరించింది. తనకు రావాల్సిన మొత్తాన్ని వడ్డీతో సహా చెల్లించాలని.. ఇప్పుడు చెల్లించకపోతే ఎప్పటిలోపు చెల్లిస్తారో బాండ్ రాసి ఇవ్వాలని అజయ్ కుమార్ సింగ్ అంటున్నారు.ఈ విషయంపై స్పష్టత కోరిన ప్రతీసారి అమీషా తప్పించుకొని తిరుగుతుందని అజయ్ కుమార్ ఆరోపణలు చేశారు. అయితే అమీషా మాత్రం తను ఎక్కడకి పారిపోలేదని.. ముంబైలోనే ఉన్నానని చెబుతోంది.