కరోనా థర్డ్ వేవ్ తీవ్రంగా ఉండదు

న్యూ ఢిల్లీ: కరోనా రెండో దాడితో పోలిస్తే మూడో దాడి అంత తీవ్రంగా ఉండదని ఐసీఎంఆర్ నిపుణుడు డాక్టర్ సమిరన్ పాండా తెలిపారు. సోమ వారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడారు. ‘కరోనా థర్డ్ వేవ్ ఎప్పుడు వస్తుందనే విషయాన్ని ఎవరూ స్పష్టంగా చెప్పలేరు. దేశంలోని వివిధ రాష్ట్రాల్లోగల జిల్లాల వారీగా కరోనా పరిస్థితుల డేటాను పరిశీలించి శాస్త్రవేత్తలు అంచనాలు వేస్తున్నారు. రోగ నిరోధక శక్తిని పెంచుకోవడం ద్వారా కరోనాను ఎదుర్కొనే సామర్థ్యం ఏర్పడుతుంది. ఆంక్షలు ఎత్తి వేసిన తరువాత కేసులు పెరుగుతూ వచ్చాయన్నా’రు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos