గెలుపును ఆపలేని మరణం

గెలుపును ఆపలేని మరణం

మహబూబాబాద్‌: మహబూబాబాద్‌ జిల్లా గార్ల మండలంలో కొత్తగా ఏర్పడిన రాజతండా పంచాయతీ ఎన్నికల్లో మూడో వార్డు ఎన్నిక ఆశ్చర్యపరిచింది. ఈ వార్డులో కాంగ్రెస్‌ మద్దతుతో బానోతు భాస్కర్‌ పోటీలో నిలిచారు. ఈయన ప్రత్యర్థిగా తెరాస మద్దతుదారు బి.శ్రీనివాస్‌ పోటీలో ఉన్నారు. ఆదివారం అనారోగ్యంతో భాస్కర్‌ ఆకస్మికంగా మరణించారు. అయినా భాస్కర్‌కు 44 ఓట్లు వచ్చాయి. ప్రత్యర్థి శ్రీనివాస్‌కు 25 ఓట్లు పోలయ్యాయి. దీంతో చనిపోయిన భాస్కర్‌ ఎన్నికల్లో గెలుపొందినట్లయింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos