అమరావతి
: ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ సమావేశం ఈ నెల 14వ తేదీకి వాయిదా పడింది. తొలుత ఈ నెల
పదిన సమావేశాన్ని నిర్వహించాలనుకున్నారు. అయితే ఎన్నికల నియమావళి అమలులో ఉన్నందున,
సమావేశం వివరాలను రాష్ట్ర ఎన్నికల సంఘానికి రెండు రోజుల ముందే సమాచారం ఇవ్వాల్సి ఉంటుందని
ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ సాయి ప్రసాద్కు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్)
ఎల్వీ సుబ్రమణ్యం తెలిపారు. మంగళవారం ఉదయం సీఎస్తో సాయి ప్రసాద్ సమావేశమైనప్పుడు
మంత్రి వర్గ భేటీకి సంబంధించిన అజెండాను పంపాలని కోరారు. ఓ కమిటీ సమావేశం ఎజెండాను
ఖరారు చేయాలని, తర్వాత దానికి ఈసీకి పంపాల్సి ఉంటుందని సీఎస్ వివరించారు. దీంతో ఈ
నెల 14న సమావేశాన్ని ఏర్పాటు చేయాలని సీఎస్ను సాయి ప్రసాద్ కోరారు.