చెన్నై: సవరించిన పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా నగరంలో సోమవారం విపక్ష డీఎంకే భారీ ర్యాలీ చేపట్టింది. దీనికి కాంగ్రెస్ పార్టీ , ఇతర విపక్షాలు కూడా మద్దతు పలికాయి. డీఎంకే అధినేత స్టాలిన్, కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం, ఎండీఎంకే అధి నేత వైగో తదితరులు ఆందోళనలో పాల్గొన్నారు. ర్యాలీకి పోలీసులు అనుమతి ఇవ్వకపోయి నా రహదారిపైకి చేరి నిరసించారు. నగరమంతటా భద్రతను కట్టుదిట్టం చేసారు.