విద్యార్థులకు శుభ వార్త

విద్యార్థులకు శుభ వార్త

అమరావతి : విద్యార్థుల బస్సు పాసుల పరిధిని పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఆర్టీసీ బస్సుల్లో 35 కిలోమీటర్ల వరకు రాయితీ పాసుల పరిధి ఉండేది. ఆ పరిధిని 50 కిలోమీటర్లకు పెంచుతూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. గ్రామాల నుంచి దూర ప్రాంతాల్లో ఉన్న పాఠశాలలు, కళాశాలలకు వెళ్లడానికి విద్యార్థులు బస్సులపై ఆధారపడుతున్నారు. కొన్ని సందర్భాల్లో ఆటోలు, ప్రైవేట్‌ వాహనాల్లో వెళ్లాల్సి వస్తోంది. దీని వల్ల ప్రమాదాలకు గురవుతున్నందున, ఆర్టీసీ ఎండీ సూచన మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. తద్వారా సుమారు 15 వేల మంది విద్యార్థులు లబ్ధి పొందనున్నారు.

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos