ఏపీ, తెలంగాణ వినియోగదారులకు బీఎస్ఎన్ఎల్ గుడ్ న్యూస్

ఏపీ, తెలంగాణ వినియోగదారులకు బీఎస్ఎన్ఎల్ గుడ్ న్యూస్

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ తెలంగాణ, ఏపీలోని ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం మరో అద్భుతమైన ప్లాన్‌ను తీసుకొచ్చింది. ఆరు నెలల కాలపరిమితి కలిగిన రూ.899 ప్లాన్‌ను సోమవారం ప్రకటించింది. రోజుకు 1.5 జీబీ డేటా చొప్పున మొత్తం 270 జీబీ డేటా ఈ ప్యాక్‌లో లభించనుంది. బీఎస్ఎన్ఎల్‌లో ఇప్పటికే రూ.999 రీచార్జ్ ప్యాక్ ఉన్నప్పటికీ దీని కాలపరిమితి కూడా 181 రోజులు మాత్రమే. ఇందులోనూ రోజుకు 1.5 జీబీ డేటా లభిస్తుంది. ఈ ప్యాక్ దేశమంతటికీ అందుబాటులో ఉండగా, రూ.899 ప్యాక్ కేవలం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సర్కిళ్లకు మాత్రమే. రూ.899 ప్యాక్‌లో రోజుకు 1.5 జీబీ డేటా, అపరిమిత వాయిస్ కాల్స్ (ముంబై, ఢిల్లీ సర్కిళ్లకు తప్ప), రోజుకు 50 ఎస్సెమ్మెస్‌లు లభిస్తాయి. రూ.999 ప్యాక్‌లో మాత్రం ఢిల్లీ, ముంబై సర్కిళ్లకు కూడా అపరిమిత వాయిస్ కాల్స్ చేసుకునే వెసులుబాటు ఉంది. కాలపరిమితి 181 రోజులు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos