ముంబై: స్టాక్ మార్కెట్లు గురువారం సానుకూలంగా ప్రారంభించాయి. 48,877 వద్ద ట్రేడింగ్ ప్రారంభించిన సెన్సెక్స్ ఉదయం 10 గంటల సమయానికి 105 పాయింట్లు లాభ పడింది. నిఫ్టి 4,668 వద్ద రోజును ప్రారంభించిన ఉదయం 10 గంటల సమయానికి 50 పాయింట్లు ఎగబాకింది. టాటా స్టీల్, బజాజ్ ఆటో, జేఎస్డబ్ల్యూ స్టీల్, అయిషర్ మోటార్స్ లాభాలను ఆర్జించాయి. భారతీ ఎయిర్టెల్, ఎస్బీఐ, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ నష్టాలను చవిచూసాయి.