ఈనాడు, ఏబీఎన్ ఛానెల్‌ పై విమర్శ

ఈనాడు, ఏబీఎన్ ఛానెల్‌ పై  విమర్శ

అమరావతి: వైకాపా ప్రభుత్వంపై కొన్ని పత్రికలు, కొన్ని ఛానెల్స్ దుష్ప్రచారం చేస్తున్నాయని మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. గురువారం తాడేపల్లి వైకాపా కార్యాలయంలో విలేఖరులతో మాట్లాడారు. ఈనాడు, ఏబీఎన్ ఛానెల్‌ పై మండి పడ్డారు. ‘అమ్మ ఒడిపై ప్రభుత్వం ఇచ్చిన వాణిజ్య ప్రకటన ఇదే పత్రికలో ఉంది.  ఆ పత్రికలోనే శ్రీమాన్ రామోజీరావు గారి తాలూకా స్వార్థం. రామోజీ రావు గారి తాలూకా సమాజ స్ఫూర్తి కాదు సామాజిక స్ఫూర్తి కార్యక్రమం కనిపిస్తుంద’ని ఆ పత్రికలో వెలువడిన కథనాన్ని చూపించారు. అమ్మఒడి  పథకం ద్వారా సుమారు నలభై మూడు లక్షల మంది తల్లులకు వారి బ్యాంకు ఖాతాల్లో ఆరువేల నాలుగు వందల కోట్ల రూపాయలను జమ చేసామన్నారు. జగన్ అధికారంలోకి వచ్చి ఏడు నెలల్లో  ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నా మ ని చెప్పారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos