ఏప్రిల్ 15 నుంచి రైల్వే బుకింగ్‌లు

ఏప్రిల్ 15 నుంచి రైల్వే బుకింగ్‌లు

న్యూ ఢిల్లీ : ప్రయాణికులకు శుభవార్త. ఈ నెల 15 నుంచి రైల్వే బుకింగ్లు తిరిగి ప్రారంభం కానున్నాయి. లాక్డౌన్ను పొడగించే అవకాశాలు లేవని కేంద్రం స్పష్టమైన సంకేతాలు రావడంతోనే ఈ నెల 15 నుంచి బుకింగ్లు ప్రారంభించనున్నట్లు సమాచారం. ‘ఏప్రిల్ 15 నుంచి ఐఆర్సీటీసీ నుంచి టిక్కెట్ బుకింగ్స్ అనుమతిస్తాం. లాక్డౌన్ 14 వరకే ఉంది. అందుకే క్రమక్రమంగా తిరిగి పని ప్రారంభం చేయాల్సిన అవసరం ఉంది. ప్యాసింజర్స్ రైళ్లను నెమ్మదిగా ప్రారంభిస్తాం. ప్రయాణాలు ఏప్రిల్ 15 నుంచే ప్రారంభం కాకపోవచ్చ’ని రైల్వే సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. లాక్డౌన్ వల్ల ఏప్రిల్ 14 వరకు అన్ని రైళ్లు రద్దయ్యాయి. విమాన సేవల బుకింగ్ కూడా ఏప్రిల్ 15 నుంచి ప్రారంభం కానుంది. ఇండిగో, స్పైస్ జెట్, గో ఏయిర్ లాంటి సంస్థలు తమ బుకింగ్లను ప్రారంభించనున్నట్లు తెలిసింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos