హోసూరులో పుస్తక మహోత్సవం

హోసూరులో పుస్తక మహోత్సవం

హోసూరు : పుస్తక మహోత్సవం శుక్రవారం ఇక్కడ ప్రారంభమైంది. హోసూరు తళి రోడ్డు శిష్య పాఠశాలలో తొమ్మిదవ వార్షిక పుస్తక మహోత్సవం వారం రోజుల పాటు నిర్వహిస్తున్నారు. పుస్తకాలను కొనేందుకు వచ్చేవారు తప్పని సరిగా శానిటైజర్తో చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. దేహ ఉష్ణోగ్రతను పరీక్ష చేయించుకున్న తర్వాత లోనికి అనుమతిస్తున్నారు. బుక్ ఫెస్టివల్ కు వచ్చే ప్రతి ఒక్కరు మాస్క్ లు తప్పనిసరిగా ధరించాలని నిర్వాహకులు సూచించారు. ఈ ఏడు నిర్వహించే బుక్ ఫెస్టివల్ కు పెద్దగా ప్రజలు వచ్చే అవకాశం తక్కువని నిర్వాహకులు తెలిపారు. కరోనా ప్రభావం వల్ల ప్రజలు బయటకు రావడానికి జంకుతున్నారని వారు వాపోయారు. బుక్ ఫెస్టివల్లో తమిళం, ఇంగ్లీషు భాషల పుస్తకాలే ఎక్కువగా కనిపించాయి. తెలుగు ప్రాంతమైన హోసూరులో నిర్వహించే పుస్తక ప్రదర్శనలో తెలుగు,కన్నడ భాషల పుస్తకాలు కనిపించకపోవడం బాధాకరం.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos