అంధుల పాఠశాలకు ఆదాల లక్ష విరాళం

అంధుల పాఠశాలకు ఆదాల లక్ష విరాళం

నెల్లూరు: లోక్సభ సభ్యుడు ఆదాల ప్రభాకర్ రెడ్డి తన జన్మదినోత్సవం సందర్భంగా శుక్రవారం విశ్వభారతి అంధుల పాఠశాలకు రూ.లక్ష విరాళాన్ని అందించారు. ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా విశ్వభారతి అంధుల పాఠశాలలో తన జన్మ దినోత్సవాన్ని జరుపుకోవడం సంతోషమని ఈ సంద ర్భంగా పేర్కొన్నారు. ఈ పాఠశాల విద్యార్థులకు మేలు జరగాలని కోరుకున్నారు. అక్కడ అవసరమైన మరుగుదొడ్లను కూడా కట్టిస్తామని హామీ ఇచ్చారు. తర్వాత విద్యార్థులకు పండ్లు పలహారాలు వితరణ చేసారు. ఆదాల భార్య వింధ్యావళి, విజయ డెయిరీ చైర్మన్ రంగారెడ్డి, నెల్లూరు రూరల్ ఇన్చార్జి గిరిధర్రెడ్డి ,కోటేశ్వర్ రెడ్డి , స్వర్ణ వెంకయ్య, సుధాకర్ రెడ్డి, అబూబకర్, ఇక్బాల్, సుధాకర్ యాదవ్, మధు, నరసింహారావు ,నెల్లూరు ఝాన్సీ లక్ష్మి, పాముల హరి తదితరులు ఈ కార్యక్రమంలోపాల్గొన్నారు

తాజా సమాచారం

Latest Posts

Featured Videos